ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-07-03T11:02:05+05:30 IST
కనగల్ మండలం తంగెళ్లవారిగూడెం గ్రామంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సతీ్షరెడ్డి తెలిపారు.
కనగల్, జూన్ 2: కనగల్ మండలం తంగెళ్లవారిగూడెం గ్రామంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సతీ్షరెడ్డి తెలిపారు. తంగెళ్లవారిగూడెం గ్రామానికి చెందిన తంగెళ్ల శంకర్రెడ్డి(45) కొద్ది కాలంగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. బుధవారం ఉదయం తన వ్యవసాయబావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తండ్రి చినపెదిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.