ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-28T06:03:50+05:30 IST

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్‌ కాలనీలో ఈ ఘటన జరిగింది.

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
సాయినాథ్‌(ఫైల్‌)

నల్లగొండ టౌన్‌, మే 27: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్‌ కాలనీలో ఈ ఘటన జరిగింది. టూటౌన్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంనగర్‌కాలనీకి చెందిన కప్పల సాయినాథ్‌ గౌడ్‌(28) రామన్నపేట ప్రభుత్వ డిగ్రీకళాశాలలో రికార్డు అసిస్టెంటుగా పనిచేస్తూ ఇటీవల సస్పెన్ష్‌న్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి సాయినాథ్‌ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మానసికంగా క్రుంగిపోయిన అతడు శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయినాథ్‌ తల్లి  ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమేదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-05-28T06:03:50+05:30 IST