ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-06-12T05:15:40+05:30 IST

ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహ త్య చేసుకున్నాడు. ఈ సంఘటన దోమకొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

దోమకొండ, జూన్‌ 11: ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహ త్య చేసుకున్నాడు. ఈ సంఘటన దోమకొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేశ్వర్‌గౌడ్‌ తెలిపిన వివారాల ప్రకరాం.. దోమకొండకు చెందిన పిడుగు సందీప్‌(24) గతంలో విదేశాలకు వెళ్లి వచ్చాడు. ఇంటి వద్ద ఉంటూ ఇతర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. విదేశాలకు వెళ్లేటప్పుడు చేసిన అప్పులు పెరిగాయి. కరోనాతో ఉపాధి దొరకక, తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నా డు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మద్యానికి బానిసై..

లింగంపేట: మండల కేంద్రానికి చెందిన కోమట్‌పల్లి అశోక్‌ (33) మద్యానికి బానిసై జీవితంపై విరక్తిచెంది శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్‌ భార్య లక్ష్మి పిల్లలతో కలిసి గత కొంత కాలంగా కామారెడ్డిలో కూలీ పనులు చేస్తూ నివసిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేకపోగా తాగుడుకు బానిసగా మారాడు. కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో గురువా రం భార్యభర్తల మధ్య గొడవలు జరగగా భార్య దేవాయిపల్లిలోని పుట్టింటికి వెళ్లింది. భార్య లక్ష్మి పిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. మృతుడికి  అనిల్‌ కుమార్‌, అభిలాష్‌ ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - 2021-06-12T05:15:40+05:30 IST