తల్లిదండ్రులు మందలించారని యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-07-28T06:52:49+05:30 IST
తల్లిదండ్రులు మందలించారని మనస్తాపం చెంది మండలంలోని తెనగల్లు గ్రామానికి చెందిన నగేష్, అన్నపూర్ణమ్మ దంపతుల కుమారుడు అజిత్ (20) మంగళవారం ఉరేసుకున్నాడు.
కుందుర్పి, జూలై 27: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపం చెంది మండలంలోని తెనగల్లు గ్రామానికి చెందిన నగేష్, అన్నపూర్ణమ్మ దంపతుల కుమారుడు అజిత్ (20) మంగళవారం ఉరేసుకున్నాడు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలివి. అజిత్ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. నిత్యం సెల్ఫోన్కే పరిమితం కావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది న అజిత్ సోమవారం రాత్రి తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో రోడ్డుపక్కనే ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. ఉదయమే కుమారు డు కనపడకపోవడంతో తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు వచ్చి చూడగా, రోడ్డుపక్కనే ఉన్న చెట్టుకు వేలాడు తూ కనిపించాడు. ఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకుంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.