యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-21T06:38:06+05:30 IST
రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం..
అనంతగిరి, జనవరి 20: రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోండ్రియాల గ్రామానికి చెందిన గొర్రెపాటి వీరమల్లు కుమారుడు భువన్(24) ఇంటర్మీడియట్ వరకు చదివి బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. చెడు అలవాట్లు మానుకోవాలని తండ్రి మందలించడంతో ఈనెల 18వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల గాలించినా, బంధువులను వాకబు చేసినా అతడి ఆచూకీ తెలియ రాలేదు. దీంతో గురువారం ఉదయం తల్లిదండ్రులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సెల్ టవర్ సిగ్నల్ ఆధారంగా గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లగా ఓ చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. భువన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, తండ్రి వీరమల్లు పీఏ సీఎస్లో గుమస్తాగా పనిచేస్తున్నారు. వీరమల్లుకు భువన్ ఏకైక కుమారుడు. చేతికి అందివచ్చిన కుమారుడు బలవన్మరణానికి పాల్పడటంతో ఇక తమకు ఇంక ఎవరు దిక్కని తల్లిదండ్రులు విలపించడాన్ని చూసి అక్కడివారు కంటతడిపెట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.