యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-26T05:51:35+05:30 IST
మండలంలోని ఆర్ అనంతపురానికి చెందిన యువకుడు భరతకుమార్ (25) బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకున్నాడు.
మడకశిర రూరల్, మే 25: మండలంలోని ఆర్ అనంతపురానికి చెందిన యువకుడు భరతకుమార్ (25) బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకున్నాడు. తండ్రి ఉ గ్రప్ప తెలిపిన వివరాలివి. భరత డిగ్రీ పూర్తి చేశాడు. ఐఏఎస్ కావాలనే పట్టుదలతో హైదరాబాద్ వెళ్లి సివిల్స్ కో చింగ్ తీసుకున్నాడు. జూన 5న పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తానో, లేదో అన్న బెంగతో మనస్తాపం చెంది ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. ఘటనతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.