HYD: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-11-07T13:02:19+05:30 IST
రాత్రంతా స్నేహితులతో సరదాగా గడిపి ఫోన్లో సరదాగా మాట్లాడిన ఓ యువకుడు తన ఇంట్లోని ఓ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయినపల్లి పోలీస్ స్టేషన్
హైదరాబాద్/బోయినపల్లి: రాత్రంతా స్నేహితులతో సరదాగా గడిపి ఫోన్లో సరదాగా మాట్లాడిన ఓ యువకుడు తన ఇంట్లోని ఓ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బోయినపల్లి సిండికేట్ బ్యాంకు కాలనీలో జరిగింది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్కు చెందిన కమల్ రాణా(25) నిరుద్యోగి. కొంతకాలంగా ఓల్డ్ బోయినపల్లి మల్లికార్జునకాలనీలోని సిండికేట్ బ్యాంక్ కాలనీలోని ఓ ఇంటి రెండో అంతస్తులో తల్లి సావిత్రి, తమ్ముడు కరణ్ రాణాతో కలిసి నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి సమయంలో తల్లి, తమ్ముడు మామయ్య ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. తలుపు తట్టి ఎంత పిలిచినా కమల్ రాణా పలకలేదు. దీనితో అనుమానం వచ్చిన తమ్ముడు పక్కనే ఉన్న కిటికీని పగలగొట్టి లోపలికి ప్రవేశించి చూడగా కమల్ రాణా ఇంట్లో ఉన్న ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. ఒక్కసారిగా కంగుతిన్న కరణ్ రాణా ఇంటి తలుపులు తీసి తల్లిని లోపలికి పిలిచి కరణ్ రాణాను కిందకు దించి చూశారు. అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఇంటి పక్కవారి సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో అన్ని కోణాల్లో పరిశీలించి ఆత్మహత్యగా నిర్ధారించారు. మృతుడి బంధువు శ్రీకృష్ణ రాణా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ వినయ్కుమార్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.