పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-25T05:41:27+05:30 IST

అప్పులబాధతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

నార్నూర్‌, ఫిబ్రవరి 24: అప్పులబాధతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నార్నూర్‌కు చెందిన అఫ్రోజ్‌ఖాన్‌(23) గత కొంతకాలంగా స్థానికంగా పాన్‌షాప్‌ నడుపుతూన్నాడు. కరోనా సమయంలో పాన్‌షాప్‌ నడవడం కష్టంగా మారింది. దీంతో అప్పులు చేసి వ్యాపారాన్ని  కొనసాగించాడు. అప్పులు ఎలా తీర్చాలని మనస్థాపానికి గురై ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు జావిద్‌కు వాట్సాప్‌ ద్వారా వీడియో పంపగా, అక్కడికి చేరుకుని స్థానిక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి ఉట్నూర్‌కి తరలించాడు. మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అఫ్రోజ్‌ఖాన్‌ రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిరోజ్‌ఖాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతుడికి గత యేడాది వివాహం కాగా భార్య, ఆరు నెలల బాబు ఉన్నారు. 

Updated Date - 2021-02-25T05:41:27+05:30 IST