ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-14T06:54:07+05:30 IST

మండలంలోని పద్మాజీవాడి గ్రామానికి చెందిన సయ్యద్‌ నిజాం(19) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శేఖర్‌ తెలిపారు.

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

సదాశివనగర్‌, మే 13: మండలంలోని పద్మాజీవాడి గ్రామానికి చెందిన సయ్యద్‌ నిజాం(19) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శేఖర్‌ తెలిపారు. పద్మాజివాడిలోని ఓ సెంటర్‌లో వర్కర్‌గా పనిచేస్తున్న నిజాం ఆరునెలలుగా ఒక అమ్మయిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. విషయాన్ని గమనించిన తండ్రి సయ్యద్‌ లతీఫ్‌ పాషా చిన్నవయస్సులో ఇలాంటి పనులు  ఏమిటని బుద్ధిగా పని చేసుకోమని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన సయ్యద్‌ నిజాం తాను పని చేస్తున్న చికెన్‌ సెంటర్‌ వెనుకభాగంలోని రేకులషేడ్‌లో ఇనుపరాడ్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తండ్రి లతీఫ్‌పాషా పిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. 

Read more