రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-04T05:31:31+05:30 IST
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
గిర్మాజిపేట, ఆగస్టు 3: అనారోగ్యంతో బాధపడుతూ జీవి తంపై విరక్తి చెందిన ఓ యువకుడు వరంగల్ రైల్వేస్టేషన్, అండర్ బ్రిడ్జి మధ్య రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డా డు. వరంగల్ జీఆర్పీ సీఐ.జి.నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీమాబాద్ బొడ్రాయి ప్రాంతానికి చెందిన ఆర్ ఎంపీ సత్యనారాయణ కుమారుడు సాయిఅక్షిత్(25) హోట ల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి రెండేళ్లుగా ఉద్యోగం కోసం యత్నిస్తున్నాడు. ఈక్రమంలో సాయిఅక్షిత్ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురికాగా ఇటీవలే ఆస్పత్రిలో చికిత్స చేయించారు. కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సాయి అక్షిత్ బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటి వెనక గోడ దూకి బయటకు వచ్చి రైల్వేస్టేషన్, అండర్బ్రిడ్జి మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సం ఘటన స్థలం వద్ద లభించిన సెల్ఫోన్ ఆధారంగా మృతుడు సాయిఅక్షిత్గా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు సీఐ తెలిపారు. ఎంజీఎంమార్చురీలో పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేర కు హెడ్కానిస్టేబుల్ పి.రాజు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.