ఆర్థిక సమస్యలతో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-04T12:39:26+05:30 IST

మహానగరం ముంబైలోని కాందీవలీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

ఆర్థిక సమస్యలతో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య

ముంబై: మహానగరం ముంబైలోని కాందీవలీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించారు. కేసు నమోదు చేసుకుని వీరి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. కాగా సంఘటనా స్థలంలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.


ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కందీవాలీ వెస్ట్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో వీరి కుటుంబం ఉంటోంది. మృతులలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఫారెన్సిక్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా డీసీపీ విశాల్ ఠాకుర్ మాట్లాడుతూ ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, వారికి ఆ ఇంటి యజమాని అజగర్ అలీతో పాటు అతని ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తున్నదన్నారు.

Updated Date - 2020-12-04T12:39:26+05:30 IST