గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-07T05:47:54+05:30 IST
మండలంలోని పెదతాడివాడ పంచాయతీ బేతనాపల్లి గ్రామ సమీ పంలోగల మామిడితోటలో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ మురళి తెలిపారు.
డెంకాడ: మండలంలోని పెదతాడివాడ పంచాయతీ బేతనాపల్లి గ్రామ సమీ పంలోగల మామిడితోటలో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ మురళి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. బేతనాపల్లి సమీపంలోగల మామిడి తోటతో శనివారం ఉదయం చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో ఏఎస్ఐ మురళి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహం సమీపంలో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మృతుడు ఒడిశా, బీహార్ ప్రాంతాలకు చెందినవాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.