తల్లిదండ్రులను తిట్టారని ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-20T06:27:46+05:30 IST

పురుగుల మందు తాగి బాలిక ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పిక్లానాయక్‌తండాలో మంగళవారం జరిగింది. కోదాడ రూరల్‌ సీఐ శివారాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పీక్లానాయక్‌ తం

తల్లిదండ్రులను తిట్టారని ఆత్మహత్య

చింతలపాలెం, అక్టోబరు 19: పురుగుల మందు తాగి బాలిక ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పిక్లానాయక్‌తండాలో మంగళవారం జరిగింది. కోదాడ రూరల్‌ సీఐ శివారాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పీక్లానాయక్‌ తండా చెం దిన బానవత్‌ శంకర్‌నాయక్‌కు అదే గ్రామానికి చెందిన లాకవాత్‌ హనుమన్‌నాయక్‌ కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నాయి. మంగళవారం సా యంత్రం ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. హనుమన్‌నాయక్‌ కుటుంబసభ్యులు బానవత్‌ శంకర్‌నాయక్‌ కుటుంబసభ్యులను నిందించడంతో మనస్తాపానికి గురైన శంకర్‌నాయక్‌ కూతురు(16) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 


Updated Date - 2021-10-20T06:27:46+05:30 IST