రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-09-01T22:01:05+05:30 IST

సిద్దిపేట: కొండపాక తహసీల్దారు కార్యాలయంలో బుధవారం రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా.. షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. 22గుంటల భూమి విషయమై కొన్ని

రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

సిద్దిపేట: కొండపాక తహసీల్దారు కార్యాలయంలో బుధవారం రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా.. షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. 22గుంటల భూమి విషయమై కొన్ని నెలలుగా రైతు దంపతులు.. తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తమ భూమి వేరే వారి పేరుతో నమోదు చేశారని దంపతులు ఆరోపించారు. తమ భూమి తమ పేరుతో నమోదు చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా.. పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని వాపోయారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డామని బోరుమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యపై కలెక్టర్ వెంకటరామిరెడ్డి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-09-01T22:01:05+05:30 IST