‘అనంత’లో దారుణం

ABN , First Publish Date - 2020-02-24T09:17:09+05:30 IST

ఏ కష్టమొచ్చిందో ఆ తల్లికి తన ముగ్గురు బిడ్డలతో పాటు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. తల్లి మరణం నుంచి బయటపడినా ముగ్గురు బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి

‘అనంత’లో దారుణం

  • బిడ్డలను బావిలోకి తోసి తల్లి ఆత్మహత్యాయత్నం
  • ముగ్గురు పిల్లలు మృతి, తల్లిని రక్షించిన గ్రామస్థులు


పుట్టపర్తి, ఫిబ్రవరి 23: ఏ కష్టమొచ్చిందో ఆ తల్లికి తన ముగ్గురు బిడ్డలతో పాటు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. తల్లి మరణం నుంచి బయటపడినా ముగ్గురు బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండల పరిధిలోని పెద్దకమ్మవారిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. స్థానికంగా నివసించే అరుణమ్మ తన ముగ్గురు కుమార్తెలు కవలలు భార్గవి(9), భవ్య(9), చందన (7) లను బావిలో వేసి తాను కూడా దూకింది. గమనించిన ఓ వ్యక్తి అరుణమ్మను బయటకు తీశాడు. కొన ఊపిరితో ఉన్న భార్గవిని సత్యసాయి జనరల్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బావిలో నుంచి ఇద్దరు చిన్నారులను బయటకు తీసేందుకు డీస్పీ రామక్రిష్ణయ్య ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-02-24T09:17:09+05:30 IST