కోర్టులో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-03-12T15:50:08+05:30 IST

సేలం కోర్టు ప్రాంగణంలో ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలానికి దారితీసింది. అత్తయమ్మన్‌పట్టి ప్రాంతానికి చెందిన పచ్చయప్పన్‌

కోర్టులో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

వాషర్‌మెన్‌పేట: సేలం కోర్టు ప్రాంగణంలో ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలానికి దారితీసింది. అత్తయమ్మన్‌పట్టి ప్రాంతానికి చెందిన పచ్చయప్పన్‌ (65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం సేలం న్యాయస్థాన ప్రాంగణంలో న్యాయదేవత విగ్రహం వద్ద పచ్చజెండాతో వచ్చాడు. న్యాయం జరగాలం టూ పచ్చయమ్మన్‌ కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించు కొనేందుకు యత్నిం చాడు. న్యాయస్థానం సిబ్బంది, పోలీసులు అతడిని అడ్డుకొని రక్షించారు. తన పూర్వీకుల ఆస్తికి సంబంధించి గత 25 ఏళ్లుగా విచారణ జరుగుతోం దని, ముఖ్యమైన సాక్ష్యాలు కూడా న్యాయస్థానంలో మాయమయ్యామని, ఈ కేసులో త్వరగా తీర్పు చెప్పాలని కోరుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో పచ్చయప్పన్‌ తెలిపాడు.

Updated Date - 2020-03-12T15:50:08+05:30 IST