ప్రాణం తీసిన ఐపీఎల్‌ బెట్టింగ్‌

ABN , First Publish Date - 2022-05-12T17:10:48+05:30 IST

ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్గొంటూ అప్పులపాలైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం దామెర మండలంలోని ఊరుగొండలో చోటుచేసుకుంంది.

ప్రాణం తీసిన ఐపీఎల్‌ బెట్టింగ్‌

-ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

దామెర (హనుమకొండ): ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్గొంటూ అప్పులపాలైన ఓ యువకుడు  ఉరి వేసుకుని  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం దామెర మండలంలోని ఊరుగొండలో చోటుచేసుకుంంది. 

ఊరుగొండ గ్రామానికి చెందిన సాంబారి నాగరాజు(23)ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవల ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో పాల్గొని రూ.లక్షా 50వేల అప్పు చేశాడు. ఈ క్రమంలో తండ్రి రవీందర్‌ అప్పులను తీర్చాడు. అన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌తో పాటు మద్యానికి బానిసై అప్పటికే తన వద్ద ఉన్న పల్సర్‌ బైక్‌ను కుదువ పెట్టి అప్పులు చేశానని, వాటిని తీర్చాలని నాగరాజు తన తండ్రి రవీందర్‌ను కోరాడు. తన వద్ద డబ్బులు లేవని తండ్రి తెలిపాడు. దీంతో మనస్తాపానికి గురైన నాగరాజు బుధవారం తెల్లవారుజామున తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి రవీందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రియ తెలిపారు.


Read more