విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-08-02T06:43:49+05:30 IST
విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
జవహర్నగర్, ఆగస్ట్ 1 (ఆంధ్రజ్యోతి): విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హర్యానా రాష్ట్రానికి చెందిన మాజీ సుబేదార్ రాజ్బీర్సింగ్ కుమార్తె సునంద జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్మీడెంటల్ కాలేజీలో 2016-17లో బీడీఎస్ కోర్సులో చేరింది. ఎంబీబీఎ్సలో సీటు రాలేదని ఒత్తిడికి గురవడంలో సైకియాట్రి్స్టకు చూపించారు. మూడు రోజుల క్రితం వీడియో కాల్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడింది. శనివారం కాలేజీలో సునంద ఆత్మహత్య చేసుకుందని తండ్రికి సమాచారం అందింది. ఎంబీబీఎ్సలో సీటు రాలేదని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు జవహర్నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.