Elephants: లారీని ఆపి చెరకు ఆరగించిన గజరాజు

ABN , First Publish Date - 2022-08-11T15:13:37+05:30 IST

సత్యమంగళం పులుల అభయారణ్యంలోని మైసూరు(Mysore) జాతీయ రహదారిలో వెళుతున్న చెరకుగడల లారీని ఓ అడవి ఏనుగు నిలిపి,

Elephants: లారీని ఆపి చెరకు ఆరగించిన గజరాజు

చెన్నై, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): సత్యమంగళం పులుల అభయారణ్యంలోని మైసూరు(Mysore) జాతీయ రహదారిలో వెళుతున్న చెరకుగడల లారీని ఓ అడవి ఏనుగు నిలిపి, చెరకు గడలను ఆబగా నమిలి తింటూ సందడి చేసింది. మైసూరు జాతీయ రహదారిలో పగటి పూట అడవి ఏనుగుల సంచారం అధికంగా ఉండటంతో ఆ రహదారిలో వెళ్లేందుకు వాహనచోదకులు భయపడుతుంటారు. అయితే లారీలు, ట్రక్కులు మాత్రం అడవి ఏనుగుల బారి నుంచి తప్పించుకుంటూ వెళుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో చెరకు గడల లోడుతో ఉన్న లారీకి ఓ అడవి ఏనుగు(Elephant) అడ్డుపడింది. డ్రైవర్‌కు ఏంచేయాలో తెలియక ఆపేశారు. నిలిపి ఉన్న లారీ వెనుకనున్న చెరకు గడలను గజరాజు సుమారు పావుగంటసేపు కడుపారా ఆరగించింది. ఆ తర్వాత  దర్జాగా నడుచుకుంటూ అడవిలోకి వెళ్లిపోయింది. 

Updated Date - 2022-08-11T15:13:37+05:30 IST