విధుల్లోనే ఊపిరి వదిలాడు

ABN , First Publish Date - 2022-01-23T06:03:03+05:30 IST

ఆయనో పారిశుధ్య కార్మికుడు. రోజువారీ కార్యక్రమంలో భాగంగా ము రుగు కాల్వలు శుభ్రం చేస్తు న్నాడు. అంత లోనే గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూ లాడు.

విధుల్లోనే ఊపిరి వదిలాడు
యాదగిరి మృతదేహం

మురుగుకాల్వలు శుభ్రం చేస్తూ పారిశుధ్య కార్మికుడి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో ఘటన 

భువనగిరి టౌన్‌, జనవరి 2: ఆయనో పారిశుధ్య కార్మికుడు. రోజువారీ కార్యక్రమంలో భాగంగా ము రుగు కాల్వలు శుభ్రం చేస్తు న్నాడు. అంత లోనే గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూ లాడు. ఆస్పత్రికి తరలించేలోపు మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. భువనగిరిలో మునిసిపల్‌ పారిశుధ్య ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుడిగా పని చేస్తున్న, జిల్లాకేంద్రానికి చెందిన వడ్డెపల్లి యాదగిరి(51) శనివారం జిల్లాకేంద్రంలోని సింగన్నగూడెంలో తోటికార్మికులతో కలిసి మురుగుకాల్వలను శుభ్రం చేస్తున్నాడు. కాలనీలోని ఓ వీధిలో యాదగిరి మురుగుకాల్వను శుభ్రం చేస్తుండగా ఇతర కార్మికులు పక్క వీధిలో పనిచేస్తున్నారు. ఎంత సేపటికీ అతను తిరిగి రాకపోవడంతో సహచర కార్మికులు వెతకగా మురుగుకాల్వ పక్కనే విగత జీవిగా పడి ఉన్నాడు. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే గుండెపోటుతో మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. యాదగిరికి ఇద్దరు కుమార్తెలు, కొడుకు, భార్య ఉన్నారు.

Updated Date - 2022-01-23T06:03:03+05:30 IST