సచివాలయం ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2022-05-19T06:14:46+05:30 IST

సిబ్బంది విధులకు డుమ్మకొడితే ఉపేక్షించేదిలేదని పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ హెచ్చరించారు. బుధవారం ఆయన మండలంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

సచివాలయం ఆకస్మిక తనిఖీ
సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ

జి.మాడుగుల, మే 18: సిబ్బంది విధులకు డుమ్మకొడితే ఉపేక్షించేదిలేదని పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ హెచ్చరించారు. బుధవారం ఆయన మండలంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా మండల కేంద్రంలోని సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరుపట్టిక, మూమెంట్‌ రిజిస్టర్‌లను పరిశీలించారు. విఽధులకు గైర్హాజరులో ఉన్న వీఆర్‌వో, వీవీఆర్‌ల జీతాలు నిలుపుదల చేయాలని ఎంపీడీవో కె.వెంకన్నబాబుకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సచివాలయ భవనాల నిర్మాణాలపై అడిగి తెలుసుకున్నారు. మందకొడిగా జరుగుతున్న పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2022-05-19T06:14:46+05:30 IST