NRI: ప్రముఖ రచయిత యెల్ది సుదర్శన్ పద్మశాలికి సన్మానం

ABN , First Publish Date - 2022-08-20T00:24:10+05:30 IST

ప్రముఖ కవి, రచయిత యెల్ది సుదర్శన్ పద్మశాలికి ముంబైలో సన్మానం జరిగింది. ప్రభాదేవీ ప్రాంతంలోని ఖడ్ గల్లీలో భారతీయ జనతా పార్టీ ముంబై సెక్రెటరీ సచిన్ సిందే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

NRI: ప్రముఖ రచయిత యెల్ది సుదర్శన్ పద్మశాలికి సన్మానం

ప్రముఖ కవి, రచయిత యెల్ది సుదర్శన్ పద్మశాలికి ముంబైలో(Mumbai) సన్మానం జరిగింది. ప్రభాదేవీ ప్రాంతంలోని ఖడ్ గల్లీలో భారతీయ జనతా పార్టీ ముంబై సెక్రెటరీ సచిన్ సిందే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ కొంకన్ విభాగ్ అఘాడి జిల్లా ఉపాధ్యక్షులు సచిన్ శిర్వడకర్, కొంకన్ వికాస్ అఘాడీ ముంబై అధ్యక్షులు సుహస్ అడ్వరీకర్, తెలుగు సమాజ్ సేవా సంస్థ ప్రముఖులు కటుకం రాజేన్న,  బీజేపీ సౌత్ ఇండియా సెల్ ముంబై సెక్రెటరీ రంపెల్లి రాజ్ పాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రచయిత యెల్ది సుదర్శన్ పద్మశాలికి సచిన్ శిర్వడకర్ చేతుల మీదుగా సన్మానం జరిగింది. అంతేకాకుండా.. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తరువాత శ్రీకృష్ణ జన్మాష్టమి, గోవిందా దయి అండి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 





Updated Date - 2022-08-20T00:24:10+05:30 IST