Viral pic:సముద్రపు గవ్వలతో మోదీ సైకత శిల్పం

ABN , First Publish Date - 2021-09-17T16:17:24+05:30 IST

ప్రఖ్యాత సైకత శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఓడిశా రాష్ట్రంలోని పూరి బీచ్‌లో అద్భుతమైన ఇసుక శిల్పంతో శుభాకాంక్షలు తెలిపారు....

Viral pic:సముద్రపు గవ్వలతో మోదీ సైకత శిల్పం

సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఫొటో ట్వీట్ 

పూరి (ఒడిశా): ప్రఖ్యాత సైకత శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఓడిశా రాష్ట్రంలోని పూరి బీచ్‌లో అద్భుతమైన ఇసుక శిల్పంతో శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ గౌరవార్థం తాను చేసిన శిల్పం చిత్రాన్ని ట్విట్టరులో పంచుకున్న సుదర్శన్ పట్నాయక్ ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.మోదీ సైకతశిల్పానికి 2035 సముద్రపు గవ్వలతో అలంకరించి ‘‘హ్యాపీ బర్త్ డే మోదీజీ’ అని క్యాప్షన్ పెట్టారు.‘‘మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మహాప్రభు జగన్నాథుడు సేవ చేయడానికి వీలుగా మోదీజీకి సుదీర్ఘ, ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుగ్రహించుగాక.’’ అని సుదర్శన్ పట్నాయక్ సందేశంలో పేర్కొన్నారు. 


సుదర్శన్ పట్నాయక్ పోస్ట్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే వేలాది లైక్‌లను సంపాదించింది. వ్యాఖ్యల విభాగంలో, సోషల్ మీడియా యూజర్లు సుదర్శన్ పట్నాయక్ చేసిన పనిని ప్రశంసించారు.‘‘ప్రధాని మోదీకి ఈ రోజు 71 సంవత్సరాలు. ఆయన జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కొవిడ్ -19 టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి సమష్ఠిగా కృషి చేయండి’’ అంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా పిలుపునిచ్చారు.

Updated Date - 2021-09-17T16:17:24+05:30 IST