రంగన్నగూడెంలో యువతీ, యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-11T06:27:34+05:30 IST

రంగన్నగూడెంలో యువతీ, యువకుడి ఆత్మహత్య

రంగన్నగూడెంలో యువతీ, యువకుడి ఆత్మహత్య

 అనారోగ్య కారణాలతో యువతి..  ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులతో గొడవపడి యువకుడు.. 

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, ఏప్రిల్‌ 10: ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులతో గొడవపడి యువకుడు, ఆనారోగ్య కారణాలతో యువతిఒకేరోజు ఆత్మహత్య చేసుకోవడంతో రంగన్నగూడెంలో కలకలం రేగింది. గ్రామానికి చెందిన యువకుడు కొలుసు నాగరాజు(28), యువతి ధర్మవరపు నాగశివ(22) శనివారం ఆత్యహత్య చేసుకున్నారు. ఎడ్ల బండి పంపకం, సోదరుడికి ఆస్తిలో ఎక్కువ వాటా ఇచ్చారని తండ్రితో గొడవ పడి కొలుసు నాగరాజు శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్యహత్య చేసుకున్నాడని, రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగశివ శనివారం ఉదయం ఇంటిలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఎస్సై మదీనాబాషా, ఏఎస్సై ఆంజనేయులు తెలిపారు. నాగశివకు నెల క్రితం వివాహ నిశ్చయమైందని,ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.  


Updated Date - 2021-04-11T06:27:34+05:30 IST