ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-11T06:26:22+05:30 IST
ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడి ఆత్మహత్య
వన్టౌన్, ఏప్రిల్ 10: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఇందిరా కాలనీకి చెందిన యువకుడు ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు శనివారం కృష్ణలంక పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇందిరా కాలనీలో నివాసముంటున్న కె.కిరణ్ (22)కు నాలుగేళ్ల క్రితం పవనకుమారితో వివాహమైంది పవనకుమారి గవర్నర్పేటలోని ఓ దుకాణంలో పని చేస్తుండగా, కిరణ్ ఫ్లవర్ డెకరేషన్ పనులతో పాటు వేరే పనులు చేస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి కిరణ్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి పవనకుమారి పని నుంచి ఇంటికి వచ్చి చూడగా కిరణ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. పోలీసులు ఘటనా ప్రదేశానికి వెళ్లి మృతుడు భార్య, కిరణ్ తల్లిదండ్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పవనకుమారి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.