వ్యక్తి ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు
ABN , First Publish Date - 2022-05-23T06:25:45+05:30 IST
వ్యక్తి ఆత్మహత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాలపురం ఇసుకర్యాంపు వద్దనుంచి పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ట్రాక్టర్ల సాయంతో ఇటుకబట్టీలకు మట్టిని తరలిస్తున్నారు.
రావులపాలెం రూరల్, మే 22: వ్యక్తి ఆత్మహత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాలపురం ఇసుకర్యాంపు వద్దనుంచి పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ట్రాక్టర్ల సాయంతో ఇటుకబట్టీలకు మట్టిని తరలిస్తున్నారు. గోపాలపురానికి చెందిన ఆకుల వీరవెంకటసత్యనారాయణ అక్కడకు వెళ్లి మట్టి తోలడానికి పర్మిషన్ ఉందా అని ప్రశ్నించిన సమయంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. మట్టిని తరలించేందుకు జేపీ వారి పర్మిషన్ ఉంది, నీమీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని వారు హెచ్చరించారు. దీంతో మనస్థాపానికి గురైన వీరవెంకటసత్యనారాయణ పురుగులమందు తాగాడు. అతనిని రావులపాలెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అపస్మారకస్థితిలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ జె.భానుప్రసాద్ ఆదివారం రాత్రి తెలిపారు.