మానసిక వేదనతో యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-05T05:16:29+05:30 IST
మానసిక వేదనతో యువకుడి ఆత్మహత్య
సంగెం, మార్చి 4: తీగరాజులపల్లిలో ఓ యువకుడు మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం. ఐత ఎల్లమ్మ, వెంక టయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చిన్న కుమారుడు ఐత అఖిల్(22) పదోతరగతి వరకు చదువుకుని, తల్లిదండ్రుల కు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కొద్దిరోజులుగా మానసిక వేదనకు గురవుతున్నాడు. ఎవరితో సరిగా మాట్లాడక పోవడంతో, భోజనం తినకపోవడం చేస్తున్నాడు. ఈక్రమంలో ఎవరూ లేని సమయంలో ఇం ట్లో ఉరి వేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.