ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-24T05:36:55+05:30 IST

బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో

ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

మియాపూర్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మియాపూర్‌ న్యూకాలనీలో నివాసం ఉండే అనీల్‌, సంగీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. శనివారం తల్లిదండ్రులు ఇద్దరూ కూలీపనికి వెళ్లారు. పెద్దకుమార్తె అనిత(14) మధ్యాహ్నం ఇంటి పక్కన ఉండే తన ఫ్రెండ్‌తో సెల్‌ఫోన్‌ విషయంలో గొడవ పడింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే కొడతారనే భయంతో ఇంట్లో ఉరేసుకుంది. స్థానికులు ఆమెను మియాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసు దర్యాప్తులో ఉంది.


Updated Date - 2021-01-24T05:36:55+05:30 IST