ఇంటి నంబర్ ఇవ్వడం లేదని ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-06-21T05:46:59+05:30 IST
ఇంటి నంబర్ ఇవ్వడం లేదని ఆత్మహత్య
శాయంపేట, జూన్ 20 : ఇంటినంబరు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం ఆత్మకూ రులో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం. శాయంపేటకు చెందిన మారెపల్లి ప్రభాక ర్(48) వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కుమారు లను పోషించుకుంటున్నాడు. భార్య కొంతకాలం నుం చి విడిగా ఉంటోంది. ప్రభాకర్ కొన్నేళ్ల క్రితం 500 చద రపు గజాల ప్లాటుకు ఇంటి నెంబర్ కోసం పంచాయతీ చుట్టూ తిరుగు తు న్నాడు. ఇంటి నెంబర్ ఇవ్వడంలో జాప్యం చేసినందుకు మనస్థాపం చెందా డు. వారి జాప్యం కారణంగా పిల్లల చదువు ఆగమవుతొందని, ప్రజాప్రతినిధు లు, జీపీ సిబ్బంది కొందరి పేర్లు సూసైడ్ నోట్లో రాసి పురుగుల మందు తాగాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలిస్తుం డగా మృతి చెందాడు. మృతికి కారణమైన వారిపై చట ్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ కుమారుడు ప్రణీత్ వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.