ఖమ్మంలో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-25T19:15:16+05:30 IST
ఖమ్మంలో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
ఖమ్మం: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైలు కింద పడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయ్యారం చెందిన నిరుద్యోగి ముత్యాలసాగర్గా గుర్తించారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వనందున మనస్తాపం చెందాడని కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.