కర్నూలు జిల్లాలో విషాదం
ABN , First Publish Date - 2021-06-12T20:42:15+05:30 IST
కర్నూలు జిల్లాలో విషాదం
కర్నూలు: జిల్లాలోని బనగానపల్లె మండలం పాతపాడులో విషాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని జంట పొలంలో పురుగుల మందు తాగారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.