ఆర్టీసీ చార్జీల పెంపుపై నిరసనను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-07-02T06:28:19+05:30 IST

ఆర్టీసీ చార్జీల పెంపుని నిరసిస్తూ శనివారం ఘాట్‌ రోడ్డు జంక్షన్‌లో చేపట్టనున్న కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ కోరారు.

ఆర్టీసీ చార్జీల పెంపుపై నిరసనను విజయవంతం చేయండి
గాదిరాయిలో టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న పీవీజీ కుమార్‌


టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌

మాడుగుల రూరల్‌, జూలై 1: ఆర్టీసీ చార్జీల పెంపుని నిరసిస్తూ శనివారం ఘాట్‌ రోడ్డు జంక్షన్‌లో చేపట్టనున్న కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ కోరారు. శుక్రవారం గాదిరాయిలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని కార్యక్రమంపై చర్చించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసలే అన్ని ధరలు పెరిగి ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని, దీనికి తోడు ఆర్టీసీ బస్సు చార్జీలను ప్రభుత్వం పెంచి  మరింత ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అద్దిపల్లి జగ్గారావు, ఉండూరు దేముడు, పెంటకోట జగన్నాథ రావు, అప్పలనాయుడు, శ్రీరామ్మూర్తి, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T06:28:19+05:30 IST