ఓపెన్ స్కూల్ ప్రవేశాలను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2020-09-19T10:05:48+05:30 IST
ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలను విజయవంతం చేయాలని విద్యాశాఖ అధికారులు, కోఆర్డినేటర్లకు డీఈవో సాయిరాం సూచించారు. శుక్రవారం బి.క్యాంపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ విద్య
కర్నూలు(ఎడ్యుకేషన్), సెప్టెంబరు 18: ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలను విజయవంతం చేయాలని విద్యాశాఖ అధికారులు, కోఆర్డినేటర్లకు డీఈవో సాయిరాం సూచించారు. శుక్రవారం బి.క్యాంపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ విద్యపై సమావేశం నిర్వహించారు. బడికి వెళ్లని, మద్యలో మానేసిన వారు ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ ద్వారా ఉన్నత విద్య అభ్యసించవచ్చని తెలిపారు.
14 సంవత్సరాలు నిండిన వారు పదో తరగతి, 15 సంవత్సరాలు నిండి పదో తరగతి పాస్, పెయిల్ అయిన వారు ఇంటర్ చదివే అవకాశం ఉందన్నారు. సెలవుల్లో మాత్రమే తరగతులు ఉంటాయని, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు ఫీజుల్లో రాయితీ ఉంటుందని అన్నారు.
ప్రచారం నిర్వహించాలని సూచించారు. కర్నూలు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి అనురాధ, ప్రకాష్ రెడ్డి, మీనాక్షి, సురేష్, ఓపెన్స్కూల్ కోఆర్డినేటర్ తిరుపతయ్య, జిల్లా కోఆర్డినేటర్ బుగ్గన, పాఠశాలల హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు.