ప్రైవేట్ డాక్టర్పై ఉప సర్పంచ్ దాడి
ABN , First Publish Date - 2022-01-21T06:20:35+05:30 IST
మండల కేంద్రంలో ప్రైవేట్గా క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ జయపాల్రెడ్డి, ఆయన సతీమణిపై వైసీపీకి చెందిన తలుపుల మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ డిక్కిబాబు అలియాస్ డీ క్రిష్ణారెడ్డి గురువారం దాడి చేశాడు.
కదిరి/తలుపుల, జనవరి 20: మండల కేంద్రంలో ప్రైవేట్గా క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ జయపాల్రెడ్డి, ఆయన సతీమణిపై వైసీపీకి చెందిన తలుపుల మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ డిక్కిబాబు అలియాస్ డీ క్రిష్ణారెడ్డి గురువారం దాడి చేశాడు. క్లినిక్లో పరికరాలను విసిరేస్తూ వీరంగం సృష్టించాడు. ఈ విషయంపై బాధిత డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల మేరకు ఉపసర్పంచ్ బంధువైన వెంకటరమణారెడ్డి వైద్యం కోసం క్లినిక్కు వెళ్లాడు. అక్కడ అప్పటికే వచ్చిన రోగులకు వరుస క్రమంలో వైద్యం అందిస్తుండగా అతనికి వైద్యం చేయడం ఆలస్యమైంది. దీనికి ఆగ్రహించిన ఉపసర్పంచ్ తన అనుచరులతో అక్కడికి వచ్చి దాడి దిగాడు. అడ్డుగా వచ్చిన డాక్టర్ సతీమణిపై కూడా దాడి చేశాడు. రోగుల అందరి ముందే ఆసుపత్రిలోని వైద్య పరికరాలను చిందరబందరగా విసిరేసి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తన బంధువుకు వైద్యం ఎందుకు చేయలేదని బూతులు తిట్టాడు. దీంతో ఉప సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బాధిత డాక్టర్ ఫిర్యాదు చేశాడు. రూరల్ సీఐ మధు మాట్లాడుతూ డాక్టర్పై ఉపసర్పంచ్ దాడి చేసినట్లు ఫిర్యా దు అందిందని విచారించి తగు చర్యలు చేపడతామన్నారు.