పురుగు మందు పిచికారికి రాయితీపై డ్రోన్లు

ABN , First Publish Date - 2022-06-30T03:51:11+05:30 IST

పంటలకు పురుగు మందు పిచికారి చేసుకొనేందుకు రాయితీపై డ్రోన్లు అందజేయనున్నట్లు ఉదయగిరి వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యనారాయణచౌదరి పేర్కొన్నారు.

పురుగు మందు పిచికారికి రాయితీపై డ్రోన్లు
సమీక్షిస్తున్న ఏడీఏ సత్యనారాయణచౌదరి

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 29: పంటలకు పురుగు మందు పిచికారి చేసుకొనేందుకు రాయితీపై డ్రోన్లు అందజేయనున్నట్లు ఉదయగిరి వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యనారాయణచౌదరి పేర్కొన్నారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఖరీఫ్‌ సీజన్‌ దృష్ట్యా సబ్‌ డివిజన్‌ పరిధిలోని మండల వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి మూడు చొప్పున సబ్‌ డివిజన్‌కు 15 యూనిట్లు డ్రోన్లు మంజూరయ్యాయన్నారు. వాటి పూర్తి ధర రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంటుందని, వ్యవసాయ పట్టుభద్రులకు 50, రైతు గ్రూపులకు 40 శాతం రాయితీతో అందజేస్తామన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు ఏ మేరకు కావాలో సిద్ధం చేసుకోవాలన్నారు. పంటల సాగులో రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడేలా సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారులు చెన్నారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, గణేష్‌, రామ్మోహన్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T03:51:11+05:30 IST