చావటానికైనా సిద్ధమే... అఖిలప్రియతో రాజీపడను: ఏవీ సుబ్బారెడ్డి

ABN , First Publish Date - 2020-06-06T17:16:10+05:30 IST

మాజీ మంత్రి అఖిలప్రియ-టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చావటానికైనా

చావటానికైనా సిద్ధమే... అఖిలప్రియతో రాజీపడను: ఏవీ సుబ్బారెడ్డి

హైదరాబాద్: మాజీ మంత్రి అఖిలప్రియ-టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చావటానికైనా సిద్ధమే... కానీ అఖిలప్రియతో మాత్రం రాజీపడనని టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకత్వం చెప్పినా.. అఖిలప్రియతో మాత్రం కలిసి పనిచేయనని తేల్చిచెప్పారు. ‘‘నాకు భయం లేదు... నన్ను నేను కాపాడుకోగలను. 35 ఏళ్లుగా ఫ్యాక్షన్‌ ఫీల్డ్‌లో ఉన్నా. అఖిలప్రియ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యాక్షన్‌ను వదిలేశాను కాబట్టే ఒంటరిగా తిరుగుతున్నా. ఆళ్లగడ్డలో తప్పకుండా రాజకీయం చేస్తా’’నని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.


Updated Date - 2020-06-06T17:16:10+05:30 IST