వరద తగ్గే వరకూ ఎవరికీ సెలవుల్లేవ్‌

ABN , First Publish Date - 2021-09-29T05:55:56+05:30 IST

గోదావరి నీటిమట్టం పెరగనున్న దృష్ట్యా లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను నరసాపురం సబ్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌ ఆదేశించారు

వరద తగ్గే వరకూ ఎవరికీ సెలవుల్లేవ్‌
యలమంచిలి మండలం చించినాడ శివారు పల్లిపాలెంలో కాల్వను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

 ప్రజలను అప్రమత్తం చేయండి  

సబ్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌


యలమంచిలి/ నరసాపురం రూరల్‌, సెప్టెంబరు 28 : గోదావరి నీటిమట్టం పెరగనున్న దృష్ట్యా లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను నరసాపురం సబ్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌ ఆదేశించారు.సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం సమాచారశాఖ అధికారులతో వరదపై సమీక్షించారు.వరద వీడే వరకు అధికారులు, సిబ్బంది సెలవులు పెట్టవద్దన్నారు.పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని తెలిపారు. నిత్యావసరాలు, బోట్లు సిద్ధం చేయాలన్నారు.వైద్య శిబిరాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉం డాలని ఆదేశించారు.అనంతరం యలమంచిలి, చించినా డలలో పర్యటించారు. చించినాడ పల్లిపాలెం గోదావరి ఏటిగట్లను పరిశీలించి గత వరదలకు బలహీన పడిన ప్రాంతాల్లో పటిష్టం చేయాలని, ఇసుక బస్తాలు  సిద్ధం చేయాలని కన్వర్జెన్స్‌ ఏఈ సుబ్బారావును ఆదేశించారు. గోదావరి ఉధృతిని పరిశీలించిన అనంతరం పుకార్లు, వదంతులు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఆయ న వెంట తహసీల్దార్‌ ఎల్‌.నరసిం హారావు, ఆర్‌ఐ, వీఆ ర్వోలు ఆయా గ్రామాల కార్యదర్శులు ఉన్నారు.  

Updated Date - 2021-09-29T05:55:56+05:30 IST