ఉండి మత్స్య పరిశోధన కేంద్రం సందర్శన
ABN , First Publish Date - 2021-04-21T06:37:10+05:30 IST
చేపలు, రొయ్యల వ్యాధుల నిర్ధా రణలో మెలకువలు ఎంతో అవసరమని ఉండి మత్స్యపరిశోధన కేంద్రం హెడ్ డా.సుగుణ అన్నారు.
ఎన్ఆర్పిఅగ్రహారం(ఉండి), ఏప్రిల్ 20 : చేపలు, రొయ్యల వ్యాధుల నిర్ధా రణలో మెలకువలు ఎంతో అవసరమని ఉండి మత్స్యపరిశోధన కేంద్రం హెడ్ డా.సుగుణ అన్నారు. ఉండి మత్స్యపరిశోధన కేంద్రాన్ని మంగళవారం వెంక ట్రామన్నగూడెంలో ఆక్వాసాగుపై జరుగుతున్న నైపుణ్య శిక్షణ రైతులు, విద్యా ర్థులు సందర్శించారు. తల్లి చేపల యాజమాన్యం, ఆక్వా ఫోనిక్స్, ఆక్వా సాగులో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించారు. ఉండి కెవికె ప్రదాన శాస్త్రవేత్త డా.శ్రీనివాస్ మాట్లాడుతూ చేపలు, రొయ్యల యాజమాన్యంలో పాటించాల్సిన పద్ధతులను వివరించారు. పిల్ల ఎంపిక, నివారణ చర్యలు, యాజమాన్య పద్ధతులు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ గూడెం కేవీకే శాస్త్రవేత్త డా.దేవీ ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.