రాఖీ పండుగను వినూత్నంగా జరుపుకున్న విద్యార్థినులు

ABN , First Publish Date - 2020-08-03T21:08:17+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విద్యార్ధినులు రక్షాబందన్ వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు...

రాఖీ పండుగను వినూత్నంగా జరుపుకున్న విద్యార్థినులు

మొరదాబాద్: ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో విద్యార్ధినులు రక్షాబంధన్ వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ప్రయత్నించారు. ‘‘పర్యావరణాన్ని పరిరక్షించండి’’, ‘‘చెట్లను రక్షించండి. జీవితాలను కాపాడండి..’’ అంటూ రాఖీలపై సందేశాలు రాశారు. ఈ సందర్భంగా ఓ విద్యార్ధిని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాం. అందరం చెట్లకు రాఖీలు కడుతున్నాం. చెట్ల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చెబుతున్నాం...’’ అని పేర్కొంది. ‘‘జనాభా పెరుగుతున్న కొద్దీ చెట్లను అంతకంతకూ నరికేస్తున్నారు. చెట్లను రక్షించి పర్యావరణాన్ని పెంపొందించడం మన బాధ్యత..’’ అని మరో విద్యార్ధిని పేర్కొంది. రక్షణకు సూచనగా రాఖీలు కడతామనీ.. అదే విధంగా చెట్లు మనల్ని కాపాడుతున్నందున వాటికి కూడా రాఖీలు కడుతున్నామని ఆమె పేర్కొంది. 

Updated Date - 2020-08-03T21:08:17+05:30 IST