విద్యార్థులు అత్యుతన్నత విజయాలు సాధించాలి
ABN , First Publish Date - 2022-08-14T06:21:56+05:30 IST
విద్యార్థులు ప్రతిభతో అత్యున్నత విజయాలను సాధించాలని గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ రోనాల్డ్రాస్ పేర్కొన్నారు.
గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ రోనాల్డ్రాస్
తంగళ్లపల్లి, అగస్టు 13 : విద్యార్థులు ప్రతిభతో అత్యున్నత విజయాలను సాధించాలని గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ రోనాల్డ్రాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల మహిళ డిగ్రీ కళాశాల వేడుకల్లో శనివారం ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ఫ్యాషన్ డిజైనింగ్, ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అయన మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులు తమ ప్రతిభతో అత్యున్నత విజయాలను సాధించాలని కోరారు. అనంతరం వివిధ యూనివర్సిటీ ఉన్నత విద్యావకాలను పొందిన తృతీయ సంవత్సరం విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కార్యదర్శి ఉమాదేవి, అసిస్టెంట్ కార్యదర్శి సొమనాథ్, ఓఎస్డీ అశ్విని, ప్రిన్సిపాల్ రజని, వైస్ ప్రిన్సిపాల్ సుధా, అధ్యాపకులు పాల్గొన్నారు.