పాఠశాలల్లోనే లాటరీ ద్వారా ఎంపిక

ABN , First Publish Date - 2021-01-24T05:25:27+05:30 IST

చిత్తూరులో కాకుండా ఇకపై ప్రవేశాలు కల్పించే పాఠశాలల్లోనే ఇకపై లాటరీ విధానం ద్వారా ఎంపికలు నిర్వహిస్తామని డీసీవో చంద్రకళాదేవి చెప్పారు

పాఠశాలల్లోనే లాటరీ ద్వారా ఎంపిక

చిత్తూరు, జనవరి 23: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్ల భర్తీ కోసం లాటరీ విధానం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ విధానం ఇకపై ఆయా పాఠశాలల్లోనే జరుగుతుందని డీసీవో కె.చంద్రకళాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరులో లాటరీ తీసి అధికారులు విద్యార్థుల ఎంపిక నిర్వహించే వారని గుర్తుచేశారు. దీంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్న విషయం ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఆ మేరకు.. దరఖాస్తు చేసుకున్న పాఠశాలల్లోనే లాటరీ నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. 

Updated Date - 2021-01-24T05:25:27+05:30 IST