Students: అదనపు బస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో

ABN , First Publish Date - 2022-09-16T14:16:26+05:30 IST

రాణిపేట జిల్లా పొగవెల్లి గ్రామం నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు బస్సులు నడపాలని విద్యార్థులు(Students) గురువారం

Students: అదనపు బస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో

వేలూరు(చెన్నై), సెప్టెంబరు 15: రాణిపేట జిల్లా పొగవెల్లి గ్రామం నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు బస్సులు నడపాలని విద్యార్థులు(Students) గురువారం రాస్తారోకో చేపట్టారు. గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన విద్యార్థులు ప్రతిరోజు పాఠశాల, కళాశాలలకు వెళ్లేందుకు బస్సులను ఆశ్రయిస్తున్నారు. కానీ, ఉదయం, సాయంత్రం బస్సులు సక్రమంగా నడుపకపోవడంతో విద్యార్థులు ఫుట్‌ బోర్డుపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రద్దీ అధికంగా ఉంటే ఆరోజు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు బస్సులు నడపాలని కోరుతూ పొగవెల్లి బస్టాండ్‌ సమీపంలోని రోడ్డుపై విద్యార్థులు భైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వాలాజాపేట పోలీసులు అక్కడకు చేరుకొని విద్యార్థులతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు.

Updated Date - 2022-09-16T14:16:26+05:30 IST