హుజురాబాద్ - జమ్మికుంట హైవేపై students ఆందోళన
ABN , First Publish Date - 2022-07-04T19:20:09+05:30 IST
జిల్లాలోని హుజురాబాద్-జమ్మికుంట హైవేపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. అఖిల మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్-జమ్మికుంట హైవేపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. అఖిల మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నేతలు, బంధువులు రైల్వే ఓవర్ బ్రిడ్జిపై బైఠాయించి నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టర్ వచ్చేవరకు కదిలేది లేదంటూ విద్యార్థులు పట్టుబట్టారు. న్యూ మిలినియం స్కూల్లో నిన్న 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. అఖిల ఎలా చనిపోయిందో పాఠశాల యాజమాన్యం వివరణ ఇవ్వకపోవడంపై విద్యార్థులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.