బడికి వెళ్లేందుకు విద్యార్థుల పాట్లు
ABN , First Publish Date - 2021-12-18T03:30:49+05:30 IST
మండలంలోని పాకపూడి, సుబ్రమణ్యం గ్రామాలకు చెందిన విద్యార్దులు విద్య నభ్యసించేందుకు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.
బాలాయపల్లి, డిసెంబరు 17: మండలంలోని పాకపూడి, సుబ్రమణ్యం గ్రామాలకు చెందిన విద్యార్దులు విద్య నభ్యసించేందుకు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. మూడేళ్ల క్రితం ఆర్టీసీ బస్సు సర్వీసును నిలిపివేయడంతో విద్యార్థులు బాలాయపల్లిలోని ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు ఆటోలే దిక్కయ్యాయి. .ఇదే అదనుగా ఆటోవాలాలు పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తుండడంపై తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు చోద్యం చూస్తున్నారు.