తహసీల్దారు కార్యాలయం ఎదుట విద్యార్థుల ధర్నా

ABN , First Publish Date - 2021-10-28T04:10:17+05:30 IST

స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట బుధవారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు.

తహసీల్దారు కార్యాలయం ఎదుట విద్యార్థుల ధర్నా
ఉదయగిరి తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థులు

ఉదయగిరి, అక్టోబరు 24: స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట బుధవారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు కాకు వెంకటయ్య మాట్లాడుతూ ఉదయగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు కొత్త భవనాలు నిర్మించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. తరగతి గదులు పెచ్చులూడి విద్యార్థుల నెత్తిన పడుతున్నాయన్నారు. పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టకి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. జూనియర్‌, డిగ్రీ కళాశాలలకు సంబంధించి విద్యార్థులకు ఉమ్మడి వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-28T04:10:17+05:30 IST