జగన్‌ ఇలాకాలో విద్యార్థినుల ఇబ్బందులు

ABN , First Publish Date - 2022-03-20T22:40:07+05:30 IST

సీఎం జగన్‌ ఇలాకాలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థినీలు ధర్నాకు దిగారు.

జగన్‌ ఇలాకాలో విద్యార్థినుల ఇబ్బందులు

కడప: సీఎం జగన్‌ ఇలాకాలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థినీలు ధర్నాకు దిగారు. కొవిడ్ రూల్స్ అనంతరం ట్రిపుల్ ఐటీకి విద్యార్థులు వచ్చారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా హాస్టల్లో విద్యార్థినులను నిర్వాహకులు ఖాళీ చేయిస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 2 వేల మంది విద్యార్థినులను ఆహారం, నీరు లేకుండా.. ఓ షెడ్డులో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ నిర్వాహకులు ఉంచారు. విద్యార్థుల అవస్థలు చూసిన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఖాళీ చేయమని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-03-20T22:40:07+05:30 IST