విద్యార్థులు క్రీడల్లో రాణించా లి
ABN , First Publish Date - 2022-08-20T03:41:17+05:30 IST
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించా లని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నీలిమ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవా లలో భాగంగా జూనియర్ కళాశాల మైదానంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల జిల్లా స్థాయి క్రీడలను శుక్రవారం నిర్వహించారు. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల నుంచి 16 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి.
లక్షెట్టిపేట రూరల్, ఆగస్టు 19: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించా లని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నీలిమ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవా లలో భాగంగా జూనియర్ కళాశాల మైదానంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల జిల్లా స్థాయి క్రీడలను శుక్రవారం నిర్వహించారు. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల నుంచి 16 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబ రిచిన విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా గిరిజన క్రీడల అభి వృద్ధి అధికారి బండ జీవరత్నం తెలిపారు. ఏటీడబ్ల్యూవో చిరంజీవి, ప్రత్యేక అధి కారి శంకర్, ప్రధానోపాధ్యాయుడు ఎంఏ గఫార్, పీఈటీలు పాల్గొన్నారు.