అన్నారంలో కన్నీటి వీడ్కోలు
ABN , First Publish Date - 2020-02-20T07:22:21+05:30 IST
గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో కొత్తకుంట చెరువులోకి మంగళవారం ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు దురదృష్టవశాత్తు చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన
గుమ్మడిదల, జనవరి 19 : గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో కొత్తకుంట చెరువులోకి మంగళవారం ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు దురదృష్టవశాత్తు చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. విద్యార్థుల మృతదేహాలకు కుటుంబ సభ్యులు, బంధువుల రోధనల మధ్య అంతిమయాత్ర బుధవారం జరిగింది. తొలుత గ్రామానికి చెందిన మహిపాల్ అనే విద్యార్థి అంత్యక్రియలను సంప్రదాయం ప్రకారం అన్నారం గ్రామంలో నిర్వహించారు. మిగతా ఇద్దరు విద్యార్థులు సందీప్, పల్లవికుమార్లను వారి సొంత స్థలమైన గుంటూరు, విజయన గరంలకు మంగళ వారం రాత్రి తరలించారు. సెలవుదినం విద్యార్థుల పాలిట శాపమైందని గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. పలువురు విద్యార్థులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.