విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-14T05:37:05+05:30 IST

పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన గొర్లె అజయ్‌ (18) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

విద్యార్థి ఆత్మహత్య

పాలకొండ: పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన గొర్లె అజయ్‌ (18)  శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం అజయ్‌ తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు  జరుపుకున్నాడు. అదేరోజు రాత్రి ఇంటిలో ఉరివేసుకున్నాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు శాంతి, గోపి బోరున విలపిస్తున్నారు. అజయ్‌ ఓ ప్రైవేటు కళాశా లలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుప త్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2022-08-14T05:37:05+05:30 IST