విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-03T06:06:57+05:30 IST
మండలంలోని ఉప్పినివలస గ్రామానికి చెందిన కపీర్ పల్లవి(15) అనే విద్యార్థిని బావిలో పడి ఆత్మహత్య చేసు కుంది. పోలీసుల వివరాల ప్రకారం..
బూర్జ: మండలంలోని ఉప్పినివలస గ్రామానికి చెందిన కపీర్ పల్లవి(15) అనే విద్యార్థిని బావిలో పడి ఆత్మహత్య చేసు కుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయిన పల్లవి తిరిగి సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చింది. ఆ రోజు రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపో యింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తల్లిదండ్రులు అరుణ, ధర్మారావు చూడగా పల్లవి కనిపించలేదు. వెంటనే డయల్ 100కు ఫోన్చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో స్థానికులు పల్లవి ఇంటి సమీ పంలోని బావిలో ఆమె మృతదేహాన్ని చూశారు. పోలీసులకు సమాచారం ఇవ్వ డంతో వారు వచ్చి మృతదేహాన్ని బయటకు తీయించి శవ పంచనామా నిర్వహిం చారు. అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ప్రేమ వ్యవహారమే పల్లవి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పల్లవి శ్రీకాకుళంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.డి.యాసిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్లవి ఆత్మహత్యతో ఉప్పినివలస గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.